
బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోంది, 70% వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పలు దేశాలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. లండన్లో లాక్డౌన్ ప్రకటించారు, క్రిస్మస్ వేడుకలను రద్దు చేశారు.
భారత్ అర్జెంట్ మీటింగ్:
రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇది పంజా విసురుతోంది. బ్రిటన్తో పాటు దక్షిణాఫ్రికాలోనూ కొత్త రకం కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తోంది. కొత్త వైరస్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.
ఇది ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి వార్తల నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇటు భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. నిపుణులతో అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది.
విమానాలపై జర్మనీ, ఇటలీలో నిషేదాజ్ఞలు:
బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై జర్మనీ, ఇటలీ దేశాలు నిషేదాజ్ఞలు విధించింది. బ్రిటన్ సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరంలోకి జారుకుంటున్నాయి.
తాజాగా ఆ రెండు దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధాజ్ఞలు విధించేందుకు జర్మనీ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

అయితే అక్కడి నుంచి వచ్చే విమానాలపై జర్మనీ దృష్టి సారించింది. బ్రిటన్లో స్ట్రెయిన్ విజృంభణకు సంబంధించిన తాజా పరిస్థితులను జర్మనీ నిశితంగా గమనిస్తోంది.
ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై నెదర్లాండ్, బెల్జియం దేశాలు నిషేధం పెట్టింది. దీంతో జర్మన్ ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తోంది. కాగా, జర్మనీలో ఇప్పటివరకు కరోనా వైరస్ స్ట్రెయిన్కు సంబంధించిన కేసులేవీ గుర్తించలేదని ప్రముఖ వైరాలజీ విభాగ వైద్యుడు క్రిస్టియన్ డ్రోస్టెన్ వెల్లడించారు.

యూకేలో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోందంటూ.. లండన్లో అక్కడి ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే బెల్జియం, నెదర్లాండ్ దేశాలు ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.
